శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లోని రాజరాజేశ్వరి కాలనిలో సర్వేనెంబర్ 78 నుండి 93 లో ప్లాట్ నెంబర్ 350 లో ఒక వ్యక్తి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జి ప్లేస్ 5 అంతస్థుల భవనం నిర్మిస్తుండగా కాలని అసోసియేషన్ తరుపున అధ్యక్షుడు విజయ్ కృష్ణ గత నెలలో జి హెచ్ ఎం సి అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయగా వారు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపి, కాలయాపన చేస్తున్నారని కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ తెలిపాడు. సదరు అక్రమ నిర్మాదారున్ని ప్రశ్నించగా నేను ఎమ్మెల్యే మనీషిని, నాకు ఆయన సపోర్ట్ ఉందని, నా బిల్డింగ్ వద్దకు ఎవరు రావద్దని ఎమ్మెల్యే చెప్పారని పేర్కొంటున్నాడని, ఇలా అయితే కాలని మొత్తం అక్రమ నిర్మాణాలే ఉంటాయని, నేనేమి అతీతున్ని కాను అంటూనే ఎమ్మెల్యే పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 20 వ తేదీ నాడు అధికారులకు పిర్యాదు చేయగా, సదరు అక్రమ నిర్మాణదారునికి అదేరోజు నోటీసులు జారీ చేసినట్లు తెలిపి అనంతరం కంప్యూటర్ లో నుండి అధికారులు ఆ విషయాన్ని తొలిగించారని కాలని అధ్యక్షుడు ఆరోపించారు. ఇట్టి విషయంలో అధికారుల కాలయాపన, ఎమ్మెల్యే పేరు వాడుకున్నందుకు ఎమ్మెల్యే ను కూడా కలుస్తామని తెలిపాడు.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని కాలని వాసులు హెచ్చరించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…