మన వార్తలు ,పటాన్ చెరు:
ఒక సంస్థ జయాపజయాలను వారి వ్యూహాత్మక పెట్టుబడి విధానాలు నిర్దేశిస్తాయని మీనాక్షి గ్రూపు చీఫ్ ఫెన్జాన్షియల్ అధికారి ( సీఎఫ్ ) డాక్టర్ ఎ.కిషోర్ చెప్పారు . పరిశ్రమ – విద్యాసంస్థల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘ వారెన్ బఫెట్ పెట్టుబడి విధానం ‘ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . బెర్క్వెర్డ్ హాత్వే స్థాపనలో కార్పొరేట్ దిగ్గజం వారెన్ బఫెట్ పెట్టుబడి వ్యూహాలను ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు .
క్రియాశీల , నిష్క్రియాత్మక పెట్టుబడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ , బఫెట్ , ప్రొటీజ్ భాగస్వాములు , టెడ్ సీడ్స్ , జీఫ్రీ టారెంట్ల మధ్య పోటీని విడమరిచి చెప్పారు . అత్యంత ధనిక పెట్టుబడిదారుల పెట్టుబడి నమూనా గురించి ఉదాహరణతో సహా వివరించి విద్యార్థులను డాక్టర్ కిషోర్ ఆకట్టుకున్నారు . తొలుత , గీతం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అతిథిని స్వాగతించి , సత్కరించారు . అధ్యాపకులు ప్రొఫెసర్ కె.శశికుమార్ , డాక్టర్ సుధ , ప్రొఫెసర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…