Categories: politicsTelangana

భవన యజమాని గోపాలకృష్ణ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదు _ పిస్తా హౌస్ నిర్వాహకులు

_భవన యజమాని వేధింపులు తాళలేకే తాము కోర్టును ఆశ్రయించామని కోర్టు ఈ ఆదేశాల మేరకే తాము ముందుకు సాగుతున్నాం

_పిస్తా హౌస్ నిర్వాహకులు క్రాంతి కుమార్, రాఘు.

మనవార్తలు ,పటాన్ చెరు;

ముత్తంగి పిస్తాహౌస్ వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ మేరకు తన కార్యాలయంపై ఈ నెల పన్నెండు వ తేదీన దాదాపు నలభై మంది గూండాలు దాడి చేసి ఎనిమిదిలక్షల నగదు అపహరించి ఇరవై లక్షల మేర ఆస్తులు ధ్వంసం చేశారని పిస్తా హౌస్ భవన యజమాని గోపాల్ గురువారం ముత్తంగి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు 2019లో శ్రీనిధి మానవి ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన క్రాంతి కుమార్, రాఘు లు తన భవనంలో పిస్తా హౌస్ పెట్టటానికి పదిహేను సంవత్సరాలు ఒప్పందం చేశారన్నారు కేవలం మూడు నెలలు మాత్రమే కిరాయి చెల్లించి అనంతరం కిరాయి చెల్లించకుండా ఇబ్బందులు గురి చేశారని కేసీఆర్ అన్న కుమారుడు పేరుతో తమకు బెదిరింపులు వస్తున్నాయని ఈ నేపధ్యంలో తన కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఈమేరకు కేసు నమోదైందని తెలిపారు.

కోర్టు నుంచి స్టే తెచ్చుకుని పిస్తా హౌస్ నిర్వహిస్తున్నారని తనకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు దీనిపై పిస్తాహౌస్ నిర్వాహకులు క్రాంతి కుమార్, రాఘు లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరణ ఇస్తూ భవన యజమాని గోపాల్ వేధింపులు,కరోనా కారణాల రీత్యా చాలాకాలం పిస్తాహౌస్ మూసేశామని ఫలితంగా కోట్ల మేర నష్టపోయి తమ ఆస్తులు కూడా అనుకున్నామన్నారు. కెసిఆర్ అన్న కుమారుడి కి ఈ వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. భవన యజమాని కార్యాలయంపై దాడి జరిగిన సంఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదని అందులో తమ పాత్ర లేదన్నారు. భవన యజమాని వేధింపులు తాళలేకే తాము కోర్టును ఆశ్రయించామని కోర్టు ఈ ఆదేశాల మేరకే తాము ముందుకు సాగుతామని ఈసందర్బంగా వారు తెలిపారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

16 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

19 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago