Telangana

నిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి. ఎల్లన్న: మాజీ మంత్రి హరీశ్ రావు

తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు

పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి

ఎల్లన్న వర్ధంతి నాటికి 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

మనవార్తలు ప్రతినిధి , తెల్లాపూర్ :

కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ జి. ఎల్లన్న గారి 85వ జయంతి ఉత్సవాలు తెల్లాపూర్‌లోని జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై, ఎల్లన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సభలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎల్లన్న కుమారుడు విజయ్ ప్రతాప్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూఎల్లన్న కేవలం ఒక కార్మిక నాయకుడిగానే కాకుండా, చివరి శ్వాస వరకు నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడని కొనియాడారు. బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఎల్లన్న పేరు తెలియని వారు, ఆయన సేవలు అందుకోని వారు ఎవరూ లేరన్నారు. ఒక సాధారణ కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, బీహెచ్‌ఈఎల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరియు జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడిగా ఎదిగి కార్మికుల మన్ననలు పొందారని గుర్తుచేశారు. ఆనాడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బాగా రెడ్డి, మల్లికార్జున్ వంటి పెద్దల సహకారంతో పోరాడి కార్మికుల కోసం ఎంఐజీ-2 కాలనీని సాధించిన అపర భగీరథుడు ఎల్లన్న అని అన్నారు.

ఉత్తర భారతదేశం నుండి వస్తున్న వారికోసం ఇక్కడి స్థానిక రిజర్వేషన్లు తొలగించినప్పుడు, నా ప్రాణం పోయినా సరే భూములు కోల్పోయిన తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలి అని సీఐఎస్ఎఫ్ యాజమాన్యంతో నిలబడి కొట్లాడిన గొప్ప స్థానిక పక్షపాతి ఎల్లన్న అని హరీశ్ రావు అన్నారు.1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో డీసీఎం వ్యాన్ నుండి దూకి రెండు కాళ్లు విరిగినా, ఆసుపత్రి మంచంపై నుంచే ‘జై తెలంగాణ’ అని నినదించిన పోరాట పటిమ ఆయనదన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు పిలుపునివ్వగానే అండగా నిలిచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని బలంగా వినిపించారని గుర్తుచేశారు.తన ఆరోగ్యం, కుటుంబం గురించి కాకుండా నిరంతరం కార్మికులు, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆలోచించిన నిస్వార్థ నాయకుడు కాబట్టే, ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. తెల్లాపూర్‌లోని ఈ కాలనీ ఫైనల్ లేఅవుట్ సమస్య వచ్చినప్పుడు ఎల్లన్న, మహిపాల్ రెడ్డి, సోమిరెడ్డి తన వద్దకు వచ్చారని నాటి సీఎం కేసీఆర్ గారితో రాత్రి 10 గంటలకు ఫోన్ లో మాట్లాడి కేవలం గంట వ్యవధిలో ఆర్డర్స్ తెప్పించి ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’ ఏర్పాటుకు అండగా నిలిచామని తెలిపారు.

ప్రస్తుతం ఆవిష్కరించిన విగ్రహం ఎల్లన్న గారి స్థాయికి తగినట్లుగా లేదని అభిప్రాయపడిన హరీశ్ రావు ఆయన ధోతీ కట్టుకొని, పంచెకట్టుతో సగర్వంగా నిలబడేలా 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు. రాబోయే రెండు నెలల్లో రానున్న ఎల్లన్న గారి వర్ధంతి నాటికల్లా ఎల్‌ఐజీ సర్కిల్‌లో గానీ, తగిన స్థలంలో గానీ ఈ 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యతను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి అప్పగిస్తున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా బీహెచ్‌ఈఎల్ ఉన్నంత కాలం ఎల్లన్న గారి పేరు కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని నివాళులర్పించారు.

admin

Recent Posts

హైలైఫ్ జూవెల్స్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రింన సినీన‌టి కామాక్షి భాస్క‌ర్ల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్ర‌ముఖ జ్యూవెల‌రీ సంస్థలు వినియోగ‌దారుల కోసం ఒకే వేదిక‌పై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…

5 hours ago

భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల దుర్వినియోగం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు…

13 hours ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యజమాన్యం పై చర్యలు తీసుకోని కార్మిక శాఖ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

బిస్లరి పరిశ్రమ కార్మికులు చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నం నిరసన అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఈనెల 25న…

13 hours ago

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా…

13 hours ago

గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం…

13 hours ago

ఆగస్టు 19న పటాన్‌చెరు యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ…

21 hours ago