అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…
పటాన్ చెరు:
ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో ఓ భర్త భార్యను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మేకవేల్ రాయి కొట్టే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన భార్య రాజేశ్వరి ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న మేక వేల్ తరచూ భార్య తో గొడవ పడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన భార్య భర్తలు ఇద్దరు గొడవ పడడం తో కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మేకవేల్ తను రాయ్ కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో బుధవారం ఉదయం భార్య తలపై కొట్టగా, రాజేశ్వరి పెద్దగా అరిచింది, దీంతో ఇంటి నుండి భర్త పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…