అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…
పటాన్ చెరు:
ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో ఓ భర్త భార్యను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మేకవేల్ రాయి కొట్టే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన భార్య రాజేశ్వరి ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న మేక వేల్ తరచూ భార్య తో గొడవ పడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన భార్య భర్తలు ఇద్దరు గొడవ పడడం తో కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మేకవేల్ తను రాయ్ కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో బుధవారం ఉదయం భార్య తలపై కొట్టగా, రాజేశ్వరి పెద్దగా అరిచింది, దీంతో ఇంటి నుండి భర్త పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…