పటాన్ చెరు:
పారగమ్య స్టెనోస్ట్ ధమనుల ద్వారా న్యూటోనియన్ కాని ద్రవ ప్రవహాల గణిత నమూనా , విశ్లేషణ ‘ దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీన్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వై.ప్రభాకర్ రెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మారుతీ ప్రసాద్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . స్టెనోజ్ ధమనుల ద్వారా ద్రవ ప్రవాహాన్ని విశ్లేషించడానికి డబుల్ – లేయర్డ్ గణిత నమూనా అభివృద్ధి చేసినట్టు ఆయన తెలియజేశారు . బయోఫ్యూయిడ్ డైనమిక్స్ లో పరిశోధన కోసం , ముఖ్యంగా నోటిక్ ప్రాంత ప్రవాహాలలో ఒక అవకాశం ఉందన్నారు .
ఈ ప్రవాహాల విశ్లేషణ డయాలసిస్ మెషిన్ , కృత్రిమ మూత్రపిండాలు , అవయవాలు మొదలైన జీవ పరికరాలను అభివృద్ధి చేయడానికి , గణిత నమూనాలను రూపొందించడానికి సహాయపడుతుందని తెలిపారు . ఈ నమూనాలు త్రీడీ ప్రింటింగ్ మెషీన్లలో ఉపయోగపడతాయన్నారు . వివిధ శారీరక పరిస్థితులలో స్టెనోటిక్ సమస్యలను పరిశీలించవచ్చన్నారు . మానవ శరీరంలో రక్త ప్రసరణను బాగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనాన్ని వినియోగిస్తారని , ధమనుల వ్యాధుల నిర్ధారణ , నివారణలో వైద్యులకు ఇది సహాయపడుతుందని ఆయన వివరించారు . ప్రభాకర్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…