Telangana

నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి

కార్మిక సంఘాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెతో కార్మిక వర్గం ఐక్యంగా కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి ఉరి తాళ్లు అయిన లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ పేర్కొన్నారు. పటాన్ చెరు లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని జరిగిన సదస్సుకు మల్లికార్జున్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు వాటితో కార్మిక వర్గానికి తీవ్రం నష్టమని అన్నారు తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కార్మిక సంఘాల పట్ల చులకన చూడడం కార్మిక సంఘాలు అభివృద్ధికి ఆటంకంగా మారాయి అనడం సరికాదని అన్నారు. కార్మికుల కర్షకుల శ్రమ లేనిదే సంపద అభివృద్ధి లేదని అన్నారు. లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి జరుగుతుందని అన్నారు. 29 కార్మిక చట్టాలు ఉన్నప్పుడే వాటిని అమలు చేయకుండా కార్మికులను యాజమాన్యాలు తీవ్రమైన శ్రమదోపిడికి పాల్పడ్డాయని అన్నారు. లేబర్ కోడ్స్ తో మరింత శ్రమ దోపిడిని యాజమాన్యాలు పాల్పడడానికి అవకాశం దొరికిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు కార్మికులతో పాటు రైతు కూలీ ఉద్యోగులకు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు అందులో భాగంగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయన్నారు పటాన్ చెరు ప్రాంతంలో కూడా కార్మికుల పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్,పి పాండురంగారెడ్డి, బి నాగేశ్వరరావు సిఐటియు సీనియర్ నాయకులు వాజిద్ అలీ , వివిధ పరిశ్రమల సిఐటియు యూనియన్ నాయకులు విఎస్ రాజు, మణిరాజ్, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, జయరాం, సుధాకర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago