Telangana

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పటాన్ చెరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, దిశా నిర్దేశం చేసిన పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరుందిన పటాన్ చెరులో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని గత 12 సంవత్సరాలుగా కృషి చేయడం మూలంగానే నేడు కళాశాల ఏర్పాటు అయ్యిందని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన కళాశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్ తో పాటు సరిపడా సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. కళాశాలకు శాశ్వత ప్రతిపాదికన భవనం ఏర్పాటు చేసేందుకు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కళాశాల సైతం ఏర్పాటు చేసేలా భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యసిద్ధితో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.
మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, తదితర సామాజిక రుగ్మతలను తరిమికొట్టడంలో విద్యార్థులు కీలక భూమిక పోషించాలని కోరారు.హాజరైన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విజయ కుమార్, పిఎస్ఎస్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నాగరాజు, బాబా వలి, వెంకటేష్, భోజయ్య, అశోక్, రాజు, షకీల్, రామిశెట్టి, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago