Telangana

చిట్కుల్‌లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జి టి ఎన్ కాలనీలో శ్రీరామనము సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ సహకారంతో కళ్యాణ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కోనసాగాయి. నీలం మధు సొంత నిధులతో నిర్మించిన ఈ ఆలయంలో గత ఐదు రోజులుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. జలధివాసం, ధాన్యాధివాసం వంటి క్రతువులతో పాటు లోక కల్యాణం కోసం నిర్వహించిన హోమాలు, యజ్ఞ యాగాదులతో చిట్కుల్ గ్రామం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన స్వామివారి విగ్రహాలకు మహా కుంభాభిషేకం నిర్వహించి, భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని సిద్ధం చేశారు.శ్రీరామనవమి రోజున అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

నీలం మధు ముదిరాజ్ దంపతులు తమ స్వగృహం నుంచి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను ఊరేగింపు గా తీసుకుని వచ్చి స్వామి వార్లకు సమర్పించి కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. సీతారాముల విగ్రహాలను చూడముచ్చటగా అలంకరించి ముత్యాల తలంబ్రాలతో సాగిన ఈ కల్యాణ ఘట్టం భక్తులకు కనువిందు చేసింది.ఈ మహత్తర కార్యక్రమానికి భక్తజనసంద్రం పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు అయ్యారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన సంగీత విభావరిలో గాయని భవాని ఆధ్వర్యంలో గాయకులు ఆలపించిన గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఆలయ ప్రాంగణమంతా జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ప్రముఖ గాయని గాయకులు ఆలపించిన భక్తి పాటలకు మహిళలతో కలిసి నీలం మధు దంపతులు కోలాటం ఆడి ఉత్సాహం పెంచారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామస్తులందరి సహకారంతో నూతన ఆలయ నిర్మాణం పూర్తి కావడం, సీతారాముల ప్రతిష్టాపన జరగడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయని తెలిపారు. ఆ సీతారాముల దయతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులందరికీ అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago