మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
టెన్త్ విద్యార్థులు భయం వీడి పరీక్షలు బాగా రాయాలనీ విద్యా హై స్కూల్ ప్రిన్సిపాల్ త్రిమూర్తులు అన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోనీ అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ సంవత్సరం పొడువునా చదివిన విద్యార్థులు చాలా మంది ఎగ్జామ్స్ అనగానే ఒక విధమైన భయానికి లోనవుతారని, తాము నేర్చుకున్న ఆన్సర్లు వస్తాయో రావో అనే సందేహాలతో నేర్చుకున్నవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి భయం కానీ తొందరపాటు కానీ పడకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇది తొలి మెట్టు అని, ఏ రంగం ఎంచుకోవాలన్నా టెన్త్ చాలా కీలమైందని, కాబట్టి బాగా చదుకోని, అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాలని సూచించారు. విద్యార్థులదరు మంచి మార్కులు సాధించాలని, అందుకు వారందరికీ ఆల్ ద బెస్ట్ అని అయన తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…