Telangana

ఇండియన్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు తేజాలు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

జీవితంలో రాణించాలంటే చదువే కాదు క్రీడలు కూడా ముఖ్యమేనని వారు నిరూపిస్తున్నారు. ఇటు మంచి చదువే కాదు, తాము చేస్తున్న ఉద్యోగాలకు తోడు ఎంచుకున్న క్రీడలకు తగిన గుర్తింపును తీసుకువస్తుంన్నారు. రాంచచంద్రాపురం లో గల బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థి రామకృష్ణo రాజు ఒకరు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు.అయినప్పటికీ వారిలోని క్రీడానైపుణ్యాన్ని వదిలి పెట్టలేరు. బీచ్ వాలీబాల్ టీమ్ లో రాణిస్తున్నారు. రేపటి నుండి థాయిలాండ్ లో జరుగనున్న బీచ్ వాలీబాల్ టౌర్న మెంట్ కు భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి విద్యాలయ పూర్వ విద్యార్థి అయిన ఎం. రామకృష్ణo రాజు, టి. నరేష్ లు సెంట్రల్ టాక్స్ జి ఎస్టీ డిపార్ట్ మెంట్ లో ఇన్స్పెక్టర్ లు గా విధులు నిర్వహిస్తూనే తాము ఎంచుకున్న బీచ్ వాలీబాల్ పోటీల్లో దూసుకుపోతు పథకాల పంటపండిస్తున్నారు. ఈ నెల 21 నుండి 25 వరకు జరిగే 21 వ ఏషియన్ వాలీబాల్ కాన్ఫిడిరేషన్ అండ్ థాయిలాండ్ వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో బంగారు పథకాలతో దేశానికి తిరిగి రావాలని క్రీడాభిమానులు, గురువులు, స్నేహితులు కోరుతున్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

18 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

20 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago