మనవార్తలు , శేరిలింగంపల్లి :
జీవితంలో రాణించాలంటే చదువే కాదు క్రీడలు కూడా ముఖ్యమేనని వారు నిరూపిస్తున్నారు. ఇటు మంచి చదువే కాదు, తాము చేస్తున్న ఉద్యోగాలకు తోడు ఎంచుకున్న క్రీడలకు తగిన గుర్తింపును తీసుకువస్తుంన్నారు. రాంచచంద్రాపురం లో గల బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థి రామకృష్ణo రాజు ఒకరు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు.అయినప్పటికీ వారిలోని క్రీడానైపుణ్యాన్ని వదిలి పెట్టలేరు. బీచ్ వాలీబాల్ టీమ్ లో రాణిస్తున్నారు. రేపటి నుండి థాయిలాండ్ లో జరుగనున్న బీచ్ వాలీబాల్ టౌర్న మెంట్ కు భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి విద్యాలయ పూర్వ విద్యార్థి అయిన ఎం. రామకృష్ణo రాజు, టి. నరేష్ లు సెంట్రల్ టాక్స్ జి ఎస్టీ డిపార్ట్ మెంట్ లో ఇన్స్పెక్టర్ లు గా విధులు నిర్వహిస్తూనే తాము ఎంచుకున్న బీచ్ వాలీబాల్ పోటీల్లో దూసుకుపోతు పథకాల పంటపండిస్తున్నారు. ఈ నెల 21 నుండి 25 వరకు జరిగే 21 వ ఏషియన్ వాలీబాల్ కాన్ఫిడిరేషన్ అండ్ థాయిలాండ్ వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో బంగారు పథకాలతో దేశానికి తిరిగి రావాలని క్రీడాభిమానులు, గురువులు, స్నేహితులు కోరుతున్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…