Telangana

తెలుగు సమాజం ఒక ఉత్తమ విద్యావేత్త, కథారచయిత ను కోల్పోయింది

  శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : 

ప్రముఖ కథా రచయిత, అధ్యాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మరణించడం తెలుగు సాహిత్యానికి తీరని లోటని. సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షులు దార్ల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పని చేశారని. ఆ సమయంలో బిఏ, ఎంఏ తెలుగు విద్యార్థులకు ఎన్నో ఉత్తమమైన పాఠ్యాంశాలను రూపకల్పన చేశారని తెలిపారు. ఆయన అనేక కథలు రాశారని జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు పేర్లతో కథా సంపుటాలుగా కూడా ఆయన కథలు వెలువడ్డాయి. ఆయన కథలు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. అనేక విశ్వవిద్యాలయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా కొత్త కొత్త పాఠ్యాంశాలు పెట్టారని పేర్కొన్నారు.

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

7 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

10 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago