Telangana

చిట్కుల్ లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామపంచాయతీ ఆవరణలో గల గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఉత్సవాల్లో నాయకులు,అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ లో ప్రజా పాలన నడుస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, సమ న్యాయం ప్రధాన ఎజెండా గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. దొరల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ, ఇందిరమ్మ పాలనను గుర్తుకు తీసుకువస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి చేస్తూ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రెండు లక్షల రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిన ఘనత రేవంత్ సర్కార్కు దక్కుతుందన్నారు. ప్రజా పాలనలో భాగంగా నూతన రేషన్ కార్డుల మంజూరు తో పాటు తెలంగాణలో ప్రతి కుటుంబానికి పూర్తి ఆరోగ్య వివరాలతో హెల్త్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాల శౌరీ,ఈఓ కవిత , వి నారాయణ,వెంకటేశ్, మురళీ, పొట్టి నారాయణ రెడ్డి,శ్రీను,గోపాల్, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

3 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

6 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago