Telangana

సాంకేతికతపై అవగాహనా కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం హైదరాబాదులోని గిట్ హబ్ (విద్యార్థుల నేతృత్వంలోని టెక్ కమ్యూనిటీ) క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అధునాతన సాంకేతికతలపై అవగాహనా కార్యక్రమాన్ని ‘గిట్ సెట్ గో’ పేరిట తొలి విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులే తమ తోటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ కార్యశాల ప్రత్యేకత.సైద్ధాంతిక అవగాహనకు మించి ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం, ఇందులో పాల్గొనేవారు వ్యక్తిగత ప్రాజెక్టుల కోసం గిట్ ని నమ్మకంగా ఉపయోగించడానికి, ఓపెన్-సోర్స్ కమ్యూనిటీలకు దోహదపడటానికి సాధికారత కల్పించడంపై ఈ కార్యశాల దృష్టి సారించింది.

వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ (డీసీఎస్), సహకార సాఫ్ట్ వేర్ అభివృద్ధిలో వాటి ప్రాముఖ్యత యొక్క అవలోకనంతో ఈ కార్యశాల ప్రారంభమైంది. గిట్ ఇన్ స్టాలేషన్, కాన్ఫిగరేషన్, రిపోజిటరీ సృష్టి, క్లోనింగ్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. తరువాత ఫోర్కింగ్ షేర్డ్ రిపోజిటరీలతో పనిచేయడం నేర్పించారు. గిట్ హబ్ విద్యార్థి అభివృద్ధి కోసం ఉద్దేశించడానికి గల కారణాలు, దాని ప్రయోజనం, వినియోగాలను వివరించారు. ఇందులో పాల్గొన్నవారికి ఆయా అంశాలపై స్పష్టత, సాంకేతిక అవగాహన ఏర్పడ్డాయి.

సీఎస్ఈ మూడో ఏడాది విద్యార్థులు సాయి గురు, హర్ష ఈ కార్యక్రమంలో ప్రధాన శిక్షకులుగా వ్యవహరించారు. దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని ఆయా సాంకేతికతలు, అధునాతన అంశాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago