Telangana

ఉపాధ్యాయులు నైపుణ్యతను పెంపొందించుకోవాలి_మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని

– పేరెంట్స్ తో సత్సంబంధాలు కలిగి ఉండాలి

– ఢిల్లీ బృందం చే ఉపాధ్యాయులకు శిక్షణ

కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల సమ్మేటివ్ 1 అనాలసిస్ మరియు ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభోత్సవంలో కృష్ణవేణి టాలెంట్,

మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఉపాధ్యాయులు తమ నైపుణ్యతను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూనే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయగలరని కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని అన్నారు. ఆదివారం పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆ సంస్థ ఇంచార్జ్ డైరెక్టర్ అచ్చే నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల సమ్మేటివ్ 1 అనాలసిస్ మరియు ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభోత్సవంలో కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నైపుణ్యత కలిగిన ఢిల్లీ బృందంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య పెరిగేలా అడ్మిషన్స్ ఎలాచేయాలి, పేరెంట్స్ తో ఎలా మాట్లాడాలి, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు, గూగుల్, యూట్యూబ్, మరియు ఫేస్ బుక్ లో రేటింగ్స్ ఎలా ఉన్నాయి, పాఠశాలలో ఏ ఏ ఆక్టివిటీస్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాజు సంగాని మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి వారిలో నిమిడి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. ఆ సంస్థ జోనల్ ఇన్చార్జి బుచ్చిరెడ్డి, ఎండి కాజా హుస్సేన్, అకాడమీ డైరెక్టర్ మురళి, శంకర్ పల్లి, భానూర్, పటాన్ చెరు, నారాయణఖేడ్, షాద్ నగర్ బ్రాంచ్ లతోపాటు బ్రాంచీల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

14 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

14 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

14 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago