సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్
అధ్యక్షులు చుక్క రాములు
-40 సంవత్సరాల పాటుగా ఒకే నాయకత్వంలో ఎవరికి సాధ్యం కానీ చారిత్రాత్మక విజయాలు
– కార్మికుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం
– శాండ్విక్ 40 వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాలీబాల్ పోటీలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతిరోజు శ్రమించే చేతులు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈయు అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. పటాన్ చెరుపారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు అనుబంధంగా ఐక్యంగా ఓకే నాయకత్వంలో 40 సంవత్సరాలు(1985-2025) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 40 వ వార్షికోత్సవము కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మండలంలోని పోచారం గ్రామ పరిధిలో గల స్విచ్ స్పోర్ట్స్ స్టేషన్ మైదానం లో కార్మికులకు నిర్వహించిన వాలీబాల్ పోటీలకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పరిశ్రమలో 40 సంవత్సరాలపాటు ఒకే నాయకత్వంలో కార్మికులను ఐక్యంగా నిలబెట్టి ఇతరులకు సాధ్యం కాని అనేక అద్భుత విజయాలు సాధించడం అనేది చారిత్రాత్మకమన్నారు. కార్మిక సంక్షేమం కోసం రాజీలేని పోరాటం, పరిశ్రమలో నూతన కార్మికులు రావడానికి యూనియన్ నాయకత్వం ఎప్పటికప్పుడు తీసుకున్న ఎత్తుగడల ద్వారా మరియు పటిష్ఠమైన కారకర్తలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. కొందరు స్వార్ధపరులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా చైతన్యం గల శాండ్విక్ కార్మికులు వాటిని అధిగమిస్తున్నారని అన్నారు. 40 వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకొని స్వర్ణోత్సవాల వైపుకి మన ప్రయాణం సాగాలని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. వాలీబాల్ పోటీలలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్.మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివరెడ్డి, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…