Telangana

గీతమ్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా, కృష్ణ తజ్ఞతాపూర్వకంగా నిర్వహించారు. యువతను సన్మార్గంలో నడుపుతూ, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా. అంకితభావంతో పనిచేస్తున్న విద్యావేత్తలను ఈ సందర్భంగా సత్కరించారు. గౌరవప్రదమైన అధ్యాపకులకు స్పా దయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు.మనదేశంలో ప్రతియేటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఇది ప్రఖ్యాత తత్వవేత్త, పండితుడు, భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని సూచిస్తుంది. విద్యార్థుల జీవితాలతో ఉపాధ్యాయులు చేసిన అమూల్యమైన సేవలను ఈరోజున స్మరించుకోవడం పరిపాటిగా మారింది.గీతం హెదరాబాద్ అధ్యాపకులకు కలకాలం గుర్తుండిపోయేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనల ద్వారా వారి ప్రతిభను ప్రదర్శించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న అధ్యాపకులకు గీతం, హెదరాబాద్ అధనపు ధపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల అంకితభావం, ఆభిరుచి, అచంచలమైన నిబద్ధత మనందరికీ స్పూర్తినిస్తాయని, ఈ కార్యక్రమ నిర్వహణలో వారి అమూల్యమైనసహకారం గర్వించదగినదని అన్నారు.

గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్, స్వాగత వచనాలతో అరంభమైన ఈ వేడుకలలో అధ్యాసకులు, విద్యార్థులు కలిసి మధుర క్షణాలను పెంచుకున్నారు. తేనీటి నిందుతో ఈ వేడుకలు ముగినాయి.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

9 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

9 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

9 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago