– ఫామ్ బీజ్ ప్రైమరి స్కూల్ మూడవ బ్రాంచ్ ప్రారంభo
మన వార్తలు, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫామ్ బీజ్ ప్రైమరీ స్కూల్ మూడవ బ్రాంచ్ ని పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది పాఠశాలలు మాత్రమే అని వాళ్ళ బంగారు భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయులు పాటుపడాలని అన్నారు. భవిష్యత్తులో ఈ స్కూలు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మహిళలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మాణంలో ప్రైమరీ స్కూల్ లు ఎంతో దోహదపడతాయని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు మొదటి గురువు అయితే, విద్యను బోధించేవారు రెండవ గురువని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అశోక్, వేణు, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్, ప్రిన్సిపాల్ షనిలా అడ్రిన్ అకడమిక్ ఇంచార్జి శ్రద్ధ సింగ్, సీనియర్ నాయకులు భాస్కర్ రావు, రోహన్, శైలేందర్ రెడ్డి, కార్యకర్తలు,స్కూలు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…