పటాన్ చెరు:
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉన్నత విద్య , నెపుణ్యాభివృద్ధి , శాస్త్ర సాంకేతిక – క్రీడలు – యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఉమేష్ నందకుమార్ పాటిల్ ఇటీవల గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జితేంద్ర పాటిల్ను ప్రతిభా పురస్కారంతో సత్కరించారు . యువతను ప్రోత్సహించడంలో భాగంగా , ఆయా రంగాలలో నిర్దిష్ట స్థాయికి చేరుకున్న వారిని ప్రతియేటా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తారని ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు డాక్టర్ జితేంద్రను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…