పటాన్ చెరు:
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉన్నత విద్య , నెపుణ్యాభివృద్ధి , శాస్త్ర సాంకేతిక – క్రీడలు – యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఉమేష్ నందకుమార్ పాటిల్ ఇటీవల గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జితేంద్ర పాటిల్ను ప్రతిభా పురస్కారంతో సత్కరించారు . యువతను ప్రోత్సహించడంలో భాగంగా , ఆయా రంగాలలో నిర్దిష్ట స్థాయికి చేరుకున్న వారిని ప్రతియేటా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తారని ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు డాక్టర్ జితేంద్రను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…