యువతకు స్వామి వివేకానంద చూపిన మార్గం అనుసరణీయం : నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నేటి యువత స్వామి వివేకానందను చూసి నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఎంతో ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ లోని ZPHS స్కూల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుడు ప్రపంచ దేశాలు గుర్తింపు పొందిన తత్వ వేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి పొందారని ఆయన తెలిపారు, దేశ భవిష్యత్తు యువతతోనే ఉందని ఆయన చెప్పిన మాటలు అక్షరాల సత్యం అని ఆయన తెలిపారు. అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడి సందేశం ఇచ్చే ప్రముఖ వ్యక్తిగా నిలిచారన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా కూడా అనేక సందర్భాల్లో ఆయన కలంతో హిందూత్వాన్ని చాటి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…