Telangana

రాష్ట్ర ప్రజలందరి పై శ్రీ వారి ఆశీస్సులుండాలి  నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో వర్ధిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉత్తర ద్వారం ద్వారా రంగ నాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. నీలం మధు మాట్లాడుతూ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లిన ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భాన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారన్నారు . వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు.

ఆ దేవదేవుడు ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రంగ నాయక ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు ఉన్న రంగసముద్రం కొలను చూడమచ్చటగా ఉందన్నారు. దేవాలయ నిర్మాణలతో పాటు ఆలయాల అభివృద్ధికి సహకరించే విషయంలో తానెప్పుడూ ముందుంటానన్నారు. అనంతరం శ్రీ రంగ సముద్రం తో పాటు రిజర్వాయర్ ను, మ్యూజియం ను వారు సందర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్,డా,,పగిడాల శ్రీనివాస్, చొప్పరి వెంకటయ్య,నరేష్, పి వెంకటయ్య, ఎం రఘు,ఆంజనేయులు,మూర్తి,కృష్ణయ్య,బిసన్న,కృష్ణ, ఈశ్వరయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago