Telangana

రాష్ట్ర ప్రజలందరి పై శ్రీ వారి ఆశీస్సులుండాలి  నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో వర్ధిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉత్తర ద్వారం ద్వారా రంగ నాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. నీలం మధు మాట్లాడుతూ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లిన ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భాన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారన్నారు . వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు.

ఆ దేవదేవుడు ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రంగ నాయక ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు ఉన్న రంగసముద్రం కొలను చూడమచ్చటగా ఉందన్నారు. దేవాలయ నిర్మాణలతో పాటు ఆలయాల అభివృద్ధికి సహకరించే విషయంలో తానెప్పుడూ ముందుంటానన్నారు. అనంతరం శ్రీ రంగ సముద్రం తో పాటు రిజర్వాయర్ ను, మ్యూజియం ను వారు సందర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్,డా,,పగిడాల శ్రీనివాస్, చొప్పరి వెంకటయ్య,నరేష్, పి వెంకటయ్య, ఎం రఘు,ఆంజనేయులు,మూర్తి,కృష్ణయ్య,బిసన్న,కృష్ణ, ఈశ్వరయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago