Telangana

భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి

మృతుల పట్ల పలు అనుమానాలు ?

మనవార్తలు , శేరిలింగంపల్లి:

భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. అంజయ్య స్వామి కూతురు సుజాత (37)ను ఇదే జిల్లాకు చెందిన నాగరాజు(42) కు 14 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. గత 7 సంవత్సరాల క్రితం భార్యా పిల్లలు సుజాత(37), సిద్దార్థ(11), రమ్యశ్రీ(8) లతో కలసి నగరానికి వలస వచ్చి పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 69, ప్లాట్ నెంబర్ 11 లో నివాసం ఉంటున్నారు. నాగరాజు టీవీఎస్ లూనాపై తిరుగుతూ కిరాణా షాపుల్లో మసాలాలు, ఇతర గృహావసర వస్తువులు సరఫరా చేస్తుంటాడు. అతని భార్య సుజాత ఇంటి దగ్గరే టైలరింగ్ పనిచేస్తూ డబ్బులు వడ్డీలకు ఇస్తూ ఉంటుందని తెలిపారు.

_ఉరికి వేళాడుతున్న నాగరాజు, హత్యకు గురైన సుజాత, సిద్ధూ, రమ్యశ్రీ

అయితే గత కొన్నాళ్లుగా నాగరాజు సుజాత దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకొని తరుచూ గొడవలు పడే వారని , కొద్ది రోజులుగా అతను పనికి కూడా వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు . శుక్రవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందిని, దీంతో భార్యా పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా భార్యా పిల్లలకు విషమిచ్చి, బ్రతికే ఉన్నారన్న అనుమానంతో టైలరింగ్ కత్తెరతో పొడిచి చంపాడని, అనంతరం తానూ ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి ఊరికి కానీ వెళ్తామని ఇటీవల చుట్టూ పక్కల వాళ్ళతో చెప్పారని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తలుపులు మూసి ఉండడం తో ఊరికి వెళ్లి ఉండొచ్చని వారు భావించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఏదో వాసనో స్తుందని అనుమానించిన వారు సోమవారం ఉదయం బయటి వైపు నుండి నిచ్చెన పైకి ఎక్కి కిటికీలో నుండి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీమ్ ను పిలిపించి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లొకి ప్రవేశించి ఆధారాలు సేకరించి, శవాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య స్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

admin

Recent Posts

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

16 hours ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

16 hours ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago

కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి_ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్…

2 days ago

శక్తి నిల్వపై విస్తృత శోధన

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో వెల్లడించిన ఏఆర్ సీఐ శాస్త్రవేత్త డాక్టర్ బులుసు శారద మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: శక్తి…

2 days ago