Telangana

భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి

మృతుల పట్ల పలు అనుమానాలు ?

మనవార్తలు , శేరిలింగంపల్లి:

భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. అంజయ్య స్వామి కూతురు సుజాత (37)ను ఇదే జిల్లాకు చెందిన నాగరాజు(42) కు 14 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. గత 7 సంవత్సరాల క్రితం భార్యా పిల్లలు సుజాత(37), సిద్దార్థ(11), రమ్యశ్రీ(8) లతో కలసి నగరానికి వలస వచ్చి పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 69, ప్లాట్ నెంబర్ 11 లో నివాసం ఉంటున్నారు. నాగరాజు టీవీఎస్ లూనాపై తిరుగుతూ కిరాణా షాపుల్లో మసాలాలు, ఇతర గృహావసర వస్తువులు సరఫరా చేస్తుంటాడు. అతని భార్య సుజాత ఇంటి దగ్గరే టైలరింగ్ పనిచేస్తూ డబ్బులు వడ్డీలకు ఇస్తూ ఉంటుందని తెలిపారు.

_ఉరికి వేళాడుతున్న నాగరాజు, హత్యకు గురైన సుజాత, సిద్ధూ, రమ్యశ్రీ

అయితే గత కొన్నాళ్లుగా నాగరాజు సుజాత దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకొని తరుచూ గొడవలు పడే వారని , కొద్ది రోజులుగా అతను పనికి కూడా వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు . శుక్రవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందిని, దీంతో భార్యా పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా భార్యా పిల్లలకు విషమిచ్చి, బ్రతికే ఉన్నారన్న అనుమానంతో టైలరింగ్ కత్తెరతో పొడిచి చంపాడని, అనంతరం తానూ ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి ఊరికి కానీ వెళ్తామని ఇటీవల చుట్టూ పక్కల వాళ్ళతో చెప్పారని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తలుపులు మూసి ఉండడం తో ఊరికి వెళ్లి ఉండొచ్చని వారు భావించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఏదో వాసనో స్తుందని అనుమానించిన వారు సోమవారం ఉదయం బయటి వైపు నుండి నిచ్చెన పైకి ఎక్కి కిటికీలో నుండి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీమ్ ను పిలిపించి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లొకి ప్రవేశించి ఆధారాలు సేకరించి, శవాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య స్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago