Telangana

ప్రయోగాధార పరిశోధనపై గీతమ్ లో వేసవి పాఠశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్ బీ ) హైదరాబాద్ లో ఆర్థిక, ఎకనామిక్స్ శాస్త్రాలలో ప్రయోగాధార పరిశోధన ద్వారా నైపుణ్య లను మెరుగుపరచుకునేందుకు, ఆయా రంగాల నిపుణులతో పరిచయాలను పెంపొందించు కునేందుకు మే 20 నుంచి 24న తేదీ వరకు వేసవి పాఠశాలను నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ అజయ్ కుమార్. వెల్లడించారు, పీహెచ్ డీ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ విద్యార్థులకు పరివర్తన అనుభవాన్ని అందించే లక్ష్యంతో జి ఎస్ బి లోని ఆర్థిక విభాగం దీనిని నిర్వహిస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్థిక, అకౌంటింగ్ పరిశోధనలో నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడం కోసం నిర్వహిస్తున్న ఈ వారం. రోజుల కార్యక్రమంలో భాగంగా, జీఎస్ఏ బీలో కొత్తగా స్థాపించిన బ్లూమ్ బెర్గ్ ఫైనాన్స్ ల్యాబ్ ను వినియోగించుకునేలా సెషన్లు రూపొందించినట్టు తెలిపారు. ఈ వారం రోజుల కార్యక్రమంలో పాల్గొనేవారు, కార్పొరేట్ ఫైనాన్స్, కార్పొరేట్ గవర్నెన్స్, బిహేవియరల్ ఫైనాన్స్ / ఎకనామిక్స్ తో పాటు ఎకనామిక పాలసీ చర్చల గురించి తెలుసుకుంటారన్నారు.

పరిశోధనా ఇతివృత్తాలను రూపొందించడం, అనుభానిక పరిశోధనలో విధానపరమైన సవాళ్లను పరిష్కరించడం, ఆచరణాత్మక అంతర్షృష్టులతో నైపుణ్య కథనాలను ప్రభావవంతంగా రాయడం, ప్రచురించడం చేస్తారని డాక్టర్ అజయ్ వివరించారు. అంతేగాక, ఎంపిక చేసుకున్న ఒక ప్రాజెక్టులో పనిచేస్తారని, ఈ కార్యక్రమం ముగిసిన 30 రోజులలోపు ముసాయిదా ప్రాజెక్టు నివేదికను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఐఐఎం నాగపూర్ చెందిన డాక్టర్ సతీష్ కుమార్, ఐఐఎం షిల్లాంగ్ కు చెందిన డాక్టర్ వర్ణీత వంటి ప్రఖ్యాత నిపుణులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని తెలియజేశారు. పీహెచ్ డీ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ విద్యార్థులు, ఆర్థిక, దాని అనుబంధ రంగాలలో పరిశోధన చేసే వారు కూడా ఈ వేసవి పాఠశాలలో పాల్గొనడానికి అర్హులని డాక్టర్ అజయ్ స్పష్టీకరించారు. పేర్ల నమోదు, రుసుము, వసతి తదితర వివరాల కోసం తన మొబైల్ నెం. 88266 99667ను సంప్రదించాలని, లేదా akumar14@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని కన్వీనర్ సూచించారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

13 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

13 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

13 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago