Hyderabad

క్యూర్ ఫుడ్స్‌ తో క‌లిసి “ఆరంభం” ప్రారంభిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌

* చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్‌

* ప్ర‌తి గింజ‌లో పోష‌క విలువ‌లు అపారం

* ఆహార రంగంలో ర‌కుల్ ప్రీత్ తొలి పెట్టుబ‌డి

మనవార్తలు ,హైదరాబాద్: 

టాలీవుడ్, బాలీవుడ్ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా త‌న సొంత డైన్-ఇన్ రెస్టారెంట్ “ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్”ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో మంగళవారం ఇది ప్రారంభమైంది. ఫిట్ నెస్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ప్రీత్, ఆరంభం కోసం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్” అనేది భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ ఫుడ్ అండ్ బెవ‌రేజెస్ సంస్థ‌, క్లౌడ్ కిచెన్ ఆప‌రేట‌ర్ క్యూర్ ఫుడ్స్‌ తో కొలాబరేషన్. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం కోసం ఎప్పుడూ నిబద్ధత చూపించే రకుల్ ప్రీత్, ఇప్పుడు ఆరంభంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, సమగ్ర ఆరోగ్యాన్ని అందరికీ అందించేందుకు సిద్ధమైంది. నేను హైద‌రాబాద్‌లో నా తొలి మిల్లెట్ ఆధారిత రెస్టారెంటును ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఫిట్ నెస్ ఔత్సాహికురాలిగా, మంచి రుచికరమైన పోషకమైన ఆహారాన్ని తినడానికి నేను ఎప్పుడూ మార్గాలను అన్వేషిస్తాను. హైదరాబాద్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది, నేను నా నట జీవితాన్ని ఇక్కడే ప్రారంభించాను. నా ఎఫ్ అండ్ బి వెంచర్ కూడా ఇక్కడే ప్రారంభమవుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రత్యేకమైన, కాలానుగుణ మెనూ చిరుధాన్యాల ఆధారిత వంటకాలతోనే రూపొందింది. రుచిలో రాజీపడకుండా ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తుంది” అని తెలిపింది.

ఈ రెస్టారెంటు ఒక విభిన్న‌మైన డైన్-ఇన్ కాన్సెప్ట్. ఇందులో పూర్తిగా చిరుధాన్యాల‌తో కూడిన వంట‌కాలే ఉంటాయి, ప్ర‌తి గింజ‌లోనూ పోష‌క విలువ‌లు ఉంటాయి. ఇది చిరుధాన్యాల కేంద్రీకృత మెనూతో అసమాన భోజన అనుభవాన్ని అందిస్తుంది. శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో అంతర్భాగంగా ఉన్న పురాతన ధాన్యాలనే ఇది అందరికీ అందజేస్తుంది. ఈ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా క్యూర్‌ఫుడ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు అంకిత్ నాగోరి మాట్లాడుతూ, “ఆరంభం అనేది కేవ‌లం ఒక రెస్టారెంటు మాత్ర‌మే కాదు; ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలికి మేం ఎలా క‌ట్టుబ‌డి ఉన్నామో, ఆహార నిర్ణ‌యాల‌పై ఎంత బాధ్య‌త‌గా ఉన్నామో అది చూపిస్తుంది. ఈ భాగ‌స్వామ్యం ప‌ట్ల మేమెంతో ఆనందిస్తున్నాం. త్వరలోనే బెంగళూరు, చెన్నైలో మరో రెండు రెస్టారెంట్లతో పాటు ఈ సంవత్సరం మరో పది క్లౌడ్ కిచెన్లు కూడా ప్రారంభిస్తాం” అని చెప్పారు.

‘అరంభం – స్టార్ట్స్ విత్ మిల్లెట్’ అనేది వంట‌కాల‌కు కాబోయే హాట్ స్పాట్. ఇక్కడ ఆహార ప్రియులు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనే లక్ష్యంతో వారి ఆహార సాహసాలను ఆహ్లాదకరమైన, స్థిరమైన విందుగా మార్చుకోవచ్చు. చిరుధాన్యాలు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా బాగుంటాయి. ఈ మిరాకిల్ ఫుడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రజల ఆహారంలో చాలా అవసరమైన పోషకాలను జోడించడానికి ప్రోత్సహిస్తోంది. కేంద్రప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి పోషక ప్రయోజనాలు, పర్యావరణ సుస్థిరతను చూపించడం ద్వారా పాకశాస్త్ర తీరుతెన్నులనే మార్చడానికి ‘అరంభం’ ప్రయత్నిస్తుంది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago