ప్రధాన శిక్షకులుగా పాల్గొన్న ఐఐటీ మద్రాసు, మహీంద్రా విశ్వవిద్యాలయాల ఆచార్యులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఆర్కిటెక్చర్ పై నిర్వహించిన వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ డీపీ) విజయవంతంగా ముగిసింది. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సు-డేటా సైన్స్ (ఏఐ&డీఎస్) విభాగాలు సంయుక్తంగా ఈ ఎఫ్డీపీని హైబ్రిడ్ విధానం (ఆన్ లైన్, ఆఫ్ లైన్)లో నిర్వహించి, గీతం మూడు ప్రాంగణాల ఆచార్యులకు తగిన మార్గనిర్ధేశనం చేశారు.ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్ మధు ముత్యం, మహీంద్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ భార్గవ రాజారాం, డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి వంటి ప్రముఖ నిపుణులు (రిసోర్స్ పర్సన్లు) విస్తృత శ్రేణి అంశాలను వారికి విశదీకరించారు. వీటిలో హార్డ్ వేర్ ఫండమెంటల్స్, మెయిన్ మెమరీ ఆర్కిటెక్చర్, ఇన్ స్ట్రక్షన్-లెవల్ ప్యారలలిజం, క్యాచి మేనేజ్మెంట్, సిస్టమ్ ఆఫ్టిమైజేషన్ టెక్నిక్ వంటివి ఉన్నాయి. వాటిపై లోతైన అవగాహన ఏర్పడేలా అభ్యాస అనుభవాన్ని గీతం అధ్యాపకులలో వారు మెరుగుపరిచారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, సీఎస్ఈ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ శాంతి చిలుకూరి, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా, ఏఐ&డీఎస్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి.శిరీష నేతృత్వంలో, డాక్టర్ యు.శ్రీనివాసరావు, శ్రీసౌమ్యల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు. ఈ వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో గీతం హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంగణాలలోని 70 మంది అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఆయా ప్రాంగణాల మధ్య సమన్వయ సహకారాలతో పాటు విద్యాభివృద్ధిని కూడా పెంపొందించింది అనడంలో అతిశయోక్తి లేదు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…