Telangana

విజయవంతంగా ముగిసిన ఎఫ్ డీపీ

ప్రధాన శిక్షకులుగా పాల్గొన్న ఐఐటీ మద్రాసు, మహీంద్రా విశ్వవిద్యాలయాల ఆచార్యులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఆర్కిటెక్చర్ పై నిర్వహించిన వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ డీపీ) విజయవంతంగా ముగిసింది. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సు-డేటా సైన్స్ (ఏఐ&డీఎస్) విభాగాలు సంయుక్తంగా ఈ ఎఫ్డీపీని హైబ్రిడ్ విధానం (ఆన్ లైన్, ఆఫ్ లైన్)లో నిర్వహించి, గీతం మూడు ప్రాంగణాల ఆచార్యులకు తగిన మార్గనిర్ధేశనం చేశారు.ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్ మధు ముత్యం, మహీంద్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ భార్గవ రాజారాం, డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి వంటి ప్రముఖ నిపుణులు (రిసోర్స్ పర్సన్లు) విస్తృత శ్రేణి అంశాలను వారికి విశదీకరించారు. వీటిలో హార్డ్ వేర్ ఫండమెంటల్స్, మెయిన్ మెమరీ ఆర్కిటెక్చర్, ఇన్ స్ట్రక్షన్-లెవల్ ప్యారలలిజం, క్యాచి మేనేజ్మెంట్, సిస్టమ్ ఆఫ్టిమైజేషన్ టెక్నిక్ వంటివి ఉన్నాయి. వాటిపై లోతైన అవగాహన ఏర్పడేలా అభ్యాస అనుభవాన్ని గీతం అధ్యాపకులలో వారు మెరుగుపరిచారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, సీఎస్ఈ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ శాంతి చిలుకూరి, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా, ఏఐ&డీఎస్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి.శిరీష నేతృత్వంలో, డాక్టర్ యు.శ్రీనివాసరావు, శ్రీసౌమ్యల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు. ఈ వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో గీతం హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంగణాలలోని 70 మంది అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఆయా ప్రాంగణాల మధ్య సమన్వయ సహకారాలతో పాటు విద్యాభివృద్ధిని కూడా పెంపొందించింది అనడంలో అతిశయోక్తి లేదు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago