Telangana

విద్యార్థులు భావిభారత నిర్దేశకులుగా ఎదగాలి_పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

శిశు విహార్ హై స్కూల్ లో ఘనంగా యానివల్ డే కార్యక్రమం

కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

:విద్యార్థులు సత్ప్రవర్తనతో రేపటి భావిభారత నిర్దేశకులుగా ఎదగాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని శిశు విహార్ హై స్కూల్ లో చైర్మన్ అండ్ కరస్పాండెంట్ అనిల్ కె. పిల్లై, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆర్.బీనా పిల్లై ల ఆధ్వర్యంలో ఘనంగా యానివల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ యానివల్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ మీటింగ్ పెట్టి విద్యార్థుల యొక్క ప్రతిభ పైన మాట్లాడాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే మంచిని మాత్రమే తెలుసుకొని, చెడు విషయాల జోలికి వెళ్ళవద్దన్నారు. అపరిచిత వ్యక్తులు మెసేజ్ లు ఫార్వర్డ్ చేసి ఓటీపీలు చెప్పమంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు. అలా అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పి చాలామంది విద్యార్థులు, యువత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలలో కూడా రాణించాలని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని, కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకొని వారి తల్లిదండ్రులకు, గురువులకు, స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా పటాన్‌చెరు, కర్దనూర్ బ్రాంచులలో విద్యార్థులకు మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తున్న శిషు విహార్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినీ, విద్యార్థులు చేసిన డ్యాన్సులు, సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, శిశు విహార్ హై స్కూల్ లో చైర్మన్ అండ్ కరస్పాండెంట్ అనిల్ కె. పిల్లై, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆర్.బీనా పిల్లై, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago