రామచంద్రపురం
నేటి తరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని గీతా భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాలలో అరబిందో ఫార్మా సహకారంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా నేడు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. కేజీ టు పీజీ విద్య విధానంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గంలో పీజీ కళాశాల తరగతులు సైతం ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు.
తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని కోరారు. శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన మంత్రి హరీష్ రావు చేతులమీదుగా మరోసారి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…