Telangana

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి

మనవార్తలు , నంద్యాల:

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి మ్రోగించార‌ని క‌ళాశాల ప్రిన్సిప‌ల్ చంద్ర‌మౌళీశ్వ‌ర రెడ్డి ,డైరెక్ట‌ర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియ‌ర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కుల‌కు గాను 463 మార్కులు,కె.వీర పూజిత‌462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కుల‌తో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించార‌ని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబ‌డి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించార‌ని ప్రిన్సిప‌ల్ చంద్ర మౌళీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.బైపీసీ విభాగంలో ఈ.శివ‌నాగ‌లమ‌ల్లేశ్వ‌రి 440 మార్కుల‌కు గాను 423 మార్కులతో క‌ళాశాల టాప‌ర్ గా నిలిచార‌ని క‌ళాశాల యాజ‌మాన్యం తెలిపింది. బీ.రాఘ‌వేంద్ర నాయ‌క్ 408 మార్కుల‌తో రెండ‌వ స్థానం,సి.అమ‌ర్ నాథ్ 401 మార్కుల‌తో మూడ‌వ స్థానం సాధించార‌నట్లు చంద్ర‌మౌళీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు .

సీఈసీ విభాగంలో ఎం.చంద్రిక 476 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించింది. బి.నాగేంద్ర 456 ,వి.నాగ‌ల‌క్ష్మీ 415 మార్కులు సాధించారు. క‌ళాశాల ప్రారంభం నుంచి జేఈఈ,నీట్ లాంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్ ఇవ్వ‌డం వ‌ల్లే ఈ ఫ‌లితాలు సాధ్య‌మైంద‌ని ..ఈ ఉత్త‌మ ఫ‌లితాల సాధ‌న‌కు కృషి చేసిన అధ్యాప‌క బృందానికి క‌ళాశాల యాజ‌మాన్యంకు అభినంద‌న‌లు  తెలిపారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago