మనవార్తలు , నంద్యాల:
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయభేరి మ్రోగించారని కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర రెడ్డి ,డైరెక్టర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కులకు గాను 463 మార్కులు,కె.వీర పూజిత462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబడి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించారని ప్రిన్సిపల్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి తెలిపారు.బైపీసీ విభాగంలో ఈ.శివనాగలమల్లేశ్వరి 440 మార్కులకు గాను 423 మార్కులతో కళాశాల టాపర్ గా నిలిచారని కళాశాల యాజమాన్యం తెలిపింది. బీ.రాఘవేంద్ర నాయక్ 408 మార్కులతో రెండవ స్థానం,సి.అమర్ నాథ్ 401 మార్కులతో మూడవ స్థానం సాధించారనట్లు చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు .
సీఈసీ విభాగంలో ఎం.చంద్రిక 476 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించింది. బి.నాగేంద్ర 456 ,వి.నాగలక్ష్మీ 415 మార్కులు సాధించారు. కళాశాల ప్రారంభం నుంచి జేఈఈ,నీట్ లాంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమైందని ..ఈ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యంకు అభినందనలు తెలిపారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…