మనవార్తలు , నంద్యాల:
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయభేరి మ్రోగించారని కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర రెడ్డి ,డైరెక్టర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కులకు గాను 463 మార్కులు,కె.వీర పూజిత462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబడి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించారని ప్రిన్సిపల్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి తెలిపారు.బైపీసీ విభాగంలో ఈ.శివనాగలమల్లేశ్వరి 440 మార్కులకు గాను 423 మార్కులతో కళాశాల టాపర్ గా నిలిచారని కళాశాల యాజమాన్యం తెలిపింది. బీ.రాఘవేంద్ర నాయక్ 408 మార్కులతో రెండవ స్థానం,సి.అమర్ నాథ్ 401 మార్కులతో మూడవ స్థానం సాధించారనట్లు చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు .
సీఈసీ విభాగంలో ఎం.చంద్రిక 476 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించింది. బి.నాగేంద్ర 456 ,వి.నాగలక్ష్మీ 415 మార్కులు సాధించారు. కళాశాల ప్రారంభం నుంచి జేఈఈ,నీట్ లాంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమైందని ..ఈ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యంకు అభినందనలు తెలిపారు .
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…