Telangana

గీతమ్ ను సందర్శించిన శ్రీఆద్య విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్, మాతృశ్రీ నగర్లోని శ్రీఆద్య జూనియర్ కళాశాలకు చెందిన 160 మంది 12వ తరగతి ఎంపీసీ విద్యార్థులు, వారి అధ్యాపకులతో కలిసి శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు. గీతం నిర్వహిస్తున్న పలు కోర్సుల వివరాలతో పాటు అందులో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ల్యాబరేటరీలు, తరగతి గదులు, ప్రపంచ శ్రేణి గ్రంథాలయం, హాస్టళ్లు వంటి వాటిని విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ఓ అవగాహనను ఏర్పరచుకున్నారు.శ్రీఆదర్య విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యశాల, అనుభవపూర్వక అభ్యాసాలను గీతం కోర్ ఇంజనీరింగ్ అధ్యాపకులు నిర్వహించారు. తమ అభిరుచికి తగ్గ ఉన్నత విద్యా కోర్సులను ఎంపిక చేసుకోవడానికి ఈ మార్గదర్శనం వారికి ఎంతో ఉపకరించింది. కేవలం విద్యకే పరిమితం కాకుండా సహ, అదనపు పాఠ్యాంశాల ద్వారా సంపూర్ణ పరిణితి సాధించడం ఎలాగో వారు గ్రహించారు. నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణలో పేరొందిన గీతం, తమ ప్రాంగణాన్ని సందర్శించిన విద్యార్థులకు మరుపురాని అనుభూతిని మిగిల్చింది.సామాజిక బాధ్యతలో భాగంగా, ఇంటర్మీడియెట్ విద్యార్థులు, వారి అధ్యాపకులకు కార్యశాలలు, అధ్యాపక వికాస కార్యక్రమాలను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. వివిధ అంశాలపై వారి నెపుణ్యాలను, పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఉపకరించేలా వీటిని రూపొందించారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 minutes ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

2 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago