Telangana

స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు

– సిఐటియు ద్వారానే సమస్యలు పరిష్కారం

– ఈనెల 14న దేశవ్యాప్త నిరసనలు

– కిర్బీ పరిశ్రమలో హ్యాట్రిక్ విజయమందించిన కార్మికులకు విప్లవ అభినందనలు
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని ఐలా భవన్ లో జరిగిన కిర్బీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం లో రాములు మాట్లాడుతూ మోడీని అధికారం నుంచి దించుతేనే కార్మిక వర్గానికి, దేశానికి, ప్రజలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీన దేశవ్యాప్తంగా మోడీ విధానాలపై నిరసన చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఆ నిరసనలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు, వరుసగా మూడోసారి గెలిపించినందుకు విప్లవ అభివందనములు తెలియజేశారు, సీఐటీయు ద్వారానే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. కార్మికుల హక్కులు, సౌకర్యాల కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. కార్మికులకు నిరంతరం సేవ చేసే కార్మిక సంఘం సీఐటియు అన్నారు. కార్మికులు రాబోయే కాలంలో ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని ఐక్య పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య, యూనియన్ జనరల్ సెక్రటరీ విఎస్ రాజు ,మల్లేశం, లకన్ ,సుధాకర్, నాగప్రసాద్, తలారి శీను, రాజేష్, మహేశ్వర్ రెడ్డి, వీరప్ప, ప్రభు తదితర కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

13 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

14 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

14 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

14 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago