మనవార్తలు ,పటాన్ చెరు;
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఐదవ చెవిటి, మూగ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో శారీరక లోపం ఉందని చింతించాల్సిన అవసరం లేదని, మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలని కోరారు. భవిష్యత్తులో నిర్వహించి టోర్నమెంట్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జితేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి సురేందర్, ప్రతినిధులు గోపి, శ్రీనివాసరావు, మదన్ కుమార్, మిలింద్ ఆచార్య, సోమేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…