_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన న్యాయవాదులు
మనవార్తలు ,పటాన్ చెరు;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరుకు మంజూరు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించేలా సహకరించాలని కోరుతూ పటాన్ చెరు, రామచంద్రపురం మండలాలకు చెందిన న్యాయవాదులు శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన వేలాది కేసుల పరిష్కారం కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని, దీని మూలంగా కక్షిదారులతోపాటు న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. పలు సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల సైతం గురికావాల్సింది వస్తుందని వాపోయారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సువీశాల విస్తీర్ణంలో, ఆధునిక వసతులతో కోర్టు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన కోర్టు కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అడ్వకేట్లు ప్రభుదన్యం, రమేష్, శ్రీనివాస్, రవికుమార్, నాగరాజు, రమాదేవి, రవి, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…