Telangana

పటాన్ చెరు కోర్టును వెంటనే ప్రారంభించండి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన న్యాయవాదులు

మనవార్తలు ,పటాన్ చెరు;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరుకు మంజూరు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించేలా సహకరించాలని కోరుతూ పటాన్ చెరు, రామచంద్రపురం మండలాలకు చెందిన న్యాయవాదులు శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన వేలాది కేసుల పరిష్కారం కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని, దీని మూలంగా కక్షిదారులతోపాటు న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. పలు సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల సైతం గురికావాల్సింది వస్తుందని వాపోయారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సువీశాల విస్తీర్ణంలో, ఆధునిక వసతులతో కోర్టు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన కోర్టు కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అడ్వకేట్లు ప్రభుదన్యం, రమేష్, శ్రీనివాస్, రవికుమార్, నాగరాజు, రమాదేవి, రవి, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago