ప్రజలకు మరింత నాణ్యమైన విద్యుత్తు
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గృహాలకు, పరిశ్రమలకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సంకల్పంతో కోటి రూపాయలతో పటాన్చెరు సబ్ స్టేషన్లో 12.5 mva పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విద్యుత్ సంస్థ ఉన్నత అధికారులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ జనాభా పరంగా విస్తరిస్తున్న పటాన్చెరు డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగం పెరిగినందున నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సంస్థ సీఎండీ తో పలు దఫాలు చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.
కోటి రూపాయలతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మరో కోటి రూపాయలను విద్యుత్ లైన్లను పటిష్టం చేసేందుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మూడు కొత్త ఫీడర్ లైన్లు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిఈ రమేష్ చంద్ర, ఏ డీ ఈ దుర్గాప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ట్రాన్స్కో సిబ్బంది పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…