Districts

కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం

ప్రజలకు మరింత నాణ్యమైన విద్యుత్తు
ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గృహాలకు, పరిశ్రమలకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సంకల్పంతో కోటి రూపాయలతో పటాన్చెరు సబ్ స్టేషన్లో 12.5 mva పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విద్యుత్ సంస్థ ఉన్నత అధికారులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ జనాభా పరంగా విస్తరిస్తున్న పటాన్చెరు డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగం పెరిగినందున నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సంస్థ సీఎండీ తో పలు దఫాలు చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.

కోటి రూపాయలతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మరో కోటి రూపాయలను విద్యుత్ లైన్లను పటిష్టం చేసేందుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మూడు కొత్త ఫీడర్ లైన్లు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిఈ రమేష్ చంద్ర, ఏ డీ ఈ దుర్గాప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ట్రాన్స్కో సిబ్బంది పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago