Telangana

సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ లో నూతన పరిశ్రమ ప్రారంభం

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

పారిశ్రామిక రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు స్వర్గధామంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో శ్రీ బయో ఆస్తేటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి బయోటిక్ సెంటర్ ను ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన సింగిల్ విండో మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మూలంగా నూతన పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా మారిందన్నారు. ప్రత్యేకంగా ఆసియాలోని అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో.. కాలుష్యరహిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా సుల్తాన్పూర్ లో ఏర్పాటు చేసిన మెడికల్ డివైస్ పార్కులో అంతర్జాతీయ పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. పారిశ్రామిక రంగానికి కావాల్సిన అన్ని మౌలిక వసతులను ఒకే చోట ప్రభుత్వం కల్పిస్తుండడంతో, నూతన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడి సాధించేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందించడంతోపాటు, రైతు బీమా, రైతు బంధు పథకాల ద్వారా వ్యవసాయ తంగం పటిష్టతకు కృషి చేస్తున్నారు అని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గంలో ఒకవైపు పరిశ్రమలు మరోవైపు సాప్ట్వేర్ పరిశ్రమలకు కేంద్రంగా నిలవడం సంతోషంగా ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్, పరిశ్రమ చైర్మన్ కె ఆర్ కె రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ సైన్స్ విభాగం రిటైర్డ్ డీన్ బహదూర్, యోగి వేమన యూనివర్సిటీ మాజీ ఉప కులపతి అర్జున రామచంద్రారెడ్డి, డైరెక్టర్ నిఖిల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago