మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీనివాస్ నక్కా డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ఎల్సీ-ఎంఎస్ పద్ధతి కోసం వ్యూహాత్మక విధానాలు AQbD, గ్రీన్ కెమిస్ట్రీ సూత్రాలను ఉపయోగించి ఫార్మాస్యూటికల్స్ లో NDSRIల అభివృద్ధి’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్. సురేంద్ర బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఆధునిక ఔషధ తయారీలో కీలకమైన భద్రతా సమస్య అయిన నైట్రోసమైన్ ఔషధ పదార్థ సంబంధిత మలినాలను (NDSRIలు) గుర్తించడం, నియంత్రించడంపై డాక్టర్ శ్రీనివాస్ పరిశోధన దృష్టి సారించినట్టు తెలియజేశారు. సిప్రోఫ్లోక్సాసిన్, మోక్సిఫ్లోక్సాసిస్ వంటి యాంటీబయాటిక్స్, అసెక్లోఫెనాక్, మెఫెనామిక్ యాసిడ్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు, ఆల్పా-1 బ్లాకర్ టామ్సులోసిన్ వంటి కీలకమైన ఔషధ తరగతులలో NDSRIలను లెక్చించడానికి వీలుగా అత్యంత సున్నితమైన UPLC-MC/MS పద్ధతులను ఈ అధ్యయనంలో అభివృద్ధి చేసినట్టు వివరించారు. ఇవి సురక్షితమైన మందులని,నియంత్రణకుఉపకరిస్తాయన్నారు.డాక్టర్ శ్రీనివాస్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించే ప్రభావవంతమైన పరిశోధనలకు గీతం నిబద్ధతను ఈ విజయం ప్రతిబింబిస్తోందని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…