Telangana

రుద్రారం గ్రామంలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల రద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ హనుమాన్ దేవస్థానంలో రాములోరి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు . స్వామి వారికి గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు చీరలు సమర్పించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు .ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ. పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో అందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలన్నారు. గ్రామం సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలన్నారు. రుద్రారం గ్రామ ప్రజలందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య , ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి,వార్డు సభ్యులు సందీప్ గౌడ్, పేoటేష్ , శ్రీనివాస్, రాజిరెడ్డి, ప్రభు ,వంశీ ,లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి ,సతీష్ గౌడ్, శ్రీనివాస్ , ప్రభు, మరియు సభ్యులు,సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు ,భక్తులు ,వివిధ సంఘాల యువకులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago