పటాన్చెరు:
శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణుడి రథయాత్ర నిర్వహించారు. స్థానిక కోదండ సీతారామస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా సాగింది.
భక్తుల జయజయ ధ్వానాల నడుమ, హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కీర్తనలు ఆలపిస్తూ యాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా పలు కూడళ్లలో ఉట్టిలు కొట్టడం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఉట్టి కొట్టి అందరిని ఉత్సాహ పరిచారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడిని కోట్లాది మంది ప్రజలు ఆరాధిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి , విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, ఎట్టయ్య, గోపాల్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, రాజు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…