Telangana

స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో విజయ దుందుభి మోగించిన శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు మరోసారి తమ సత్తాను నిరూపించారు. చదువులోనే కాదు అన్ని రంగాల్లోనూ ముందుంటామని మరోసారి చాటి చెప్పారనీ స్కూల్ ప్రిన్సిపాల్ యూ. వాణి తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం స్వర్గీయ బి. యస్. రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్ లో నల్లగండ్ల విద్యార్థులు బ్యాట్మెంటన్ లో ప్రథమ స్థానాన్ని షార్ట్ పుట్ లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని ఘన విజయం సాధించారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ గొంగడి త్రిష, శ్రీ చైతన్య పాఠశాలల డైరెక్టర్ సీమ, ఏజీఎం. శివరామకృష్ణ, ఆర్ ఐ. అనిత, జోనల్ స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్, జోనల్ స్పోర్ట్స్ ఇంచార్జ్ మధు, స్పోర్ట్స్ టీచర్స్ సుబుద్ధి, సంతోష్ లు పాల్గొన్నారు. మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన విద్యార్థులు పలువురి చూపరుల ప్రశంసలు అందుకున్నారు. విజేతలను ఏజీఎం శివరామకృష్ణ, ఆర్. ఐ. అనిత చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్స్, ఛాంపియన్ ట్రోఫీని అందుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ యు వాణి తమ విద్యార్థులు ఇంతటి ఘనవిజయం సాధించినందుకు గర్వంగా ఉందని ఈ విజయానికి కారణమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని ఆకాంక్షించారు. శ్రీ చైతన్య యాజమాన్యం విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago