పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మత్స్య సంపదలో తెలంగాణ అగ్రస్థానంగా ఉందని పటాన్చెరు మండలం అధ్యక్షుడు శ్రీ ఆకుల శివకృష్ణ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఫిషర్ సొసైటీ అధ్యక్షులు సుంకర బోయిన మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మండలాల వారిగా మృత్యు సొసైటీ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో పటాన్ చెరువు మండల అధ్యక్షుడిగా శ్రీ ఆకుల శివకృష్ణకు నియామకపత్రాన్ని స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. పటాన్చెరు మండలం అధ్యక్షుడు శ్రీ ఆకుల శివకృష్ణ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ఉపాధిగా ఉన్న చెరువులను కుంటలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షించి మత్స్యకారుల జీవనోపాధి కలిగే విధంగా ప్రత్యేకంగా చొరవ చూపాలని ,మత్స్య సంపదను అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించగలరని శ్రీ ఆకుల శివకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపకులు పిట్టల రవీందర్ ముదిరాజ్, పటాన్చెరు నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు నీలం లత, ఉపాధ్యక్షురాలు పూజల పురం వీరేష్, ప్రధాన కార్యదర్శిగా చింతల వీరేష్ ,అమీన్పూర్ మండల అధ్యక్షులుగా మన్నే రాములు, రామచంద్రపురం మండల అధ్యక్షులుగా బాలకృష్ణ, కంది మండల అధ్యక్షుడు కృష్ణ ,పటాన్చెరు మండల అధ్యక్షులు శ్రీ ఆకుల శివకృష్ణ (చంటీ ) ముదిరాజ్, మరియు మస్తకార సంఘ సభ్యులు ఫిషరీస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…