Telangana

గణేష్ గడ్డ దేవాలయానికి ప్రత్యేక ర్యాంపు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ అధికారులతో సమీక్ష

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం లో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక గణపతి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ర్యాంపు, మెట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం జాతీయ రహదారి విస్తరణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, ఆలయ కమిటీ పాలకవర్గం, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి దేవాలయం సమీపంలో చేపడుతున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే గణేష్ గడ్డ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని తెలిపారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గుడి సమీపంలో చేపడుతున్న పనుల మూలంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి నుండి నేరుగా దేవాలయం పరిసరాల్లోకి వచ్చే విధంగా ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు, స్వాగత తోరణం నుండి ఆలయం వరకు మెట్ల నిర్మాణం, నూతన ఆర్చి,.గుడి చుట్టూ 50 అడుగుల సామర్థ్యంతో సిసి ఫ్లోరింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగా పైన పేర్కొన్న పనులన్నీ పూర్తి చేయాలని జాతీయ రహదారుల డిఈ రామకృష్ణను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోతే గుడి సమీపంలో అండర్ పాసెజ్ సైతం నిర్మించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, స్థానిక కౌన్సిలర్లు రాజు, లత, మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి, వెంకన్న, ఆలయ కమిటీ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, ఆలయ ఈవో లావణ్య, సీనియర్ నాయకులు నర్సింహ రెడ్డి, శ్రీకాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago