Hyderabad

తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ….

తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ
– కేసీఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా తెలంగాణ
– ఐఎన్ టియూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి

పటాన్ చెరు:

తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీయని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా మంగళవారం స్థానిక బస్టాండ్ ఎదురుగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. 7 సంవత్సరాల్లో కనీసం 70 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయించడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ నుండే కొంత కేటాయిస్తున్నారే తప్ప, రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు రావడంలేదన్నారు. మిగులు బడ్జెట్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అమరుల ఆశయాల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్, యువరాజ్ మోరే, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago