మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో – ఆర్డినేటర్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటిలో పాల్గొన్న విజేతలకు పాశమైలారం మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ముగ్గుల పోటీలలో పాల్గొని సృజనాత్మకతను చూపించడం అభినందనీయమన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులను అభినందించారు.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమవంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రామిక సంక్షేమ కేంద్రం కో ఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ శ్రామిక ప్రజల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులు వెంకటేష్, చంద్రయ్య, ఈశ్వరరావు, ప్రభు, అనాజీ, రమేష్, శ్రీను, యకమ్మ, దేవి, హేమ,సువర్ణ, హారిక, మాదవి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…