మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో – ఆర్డినేటర్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటిలో పాల్గొన్న విజేతలకు పాశమైలారం మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ముగ్గుల పోటీలలో పాల్గొని సృజనాత్మకతను చూపించడం అభినందనీయమన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులను అభినందించారు.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమవంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రామిక సంక్షేమ కేంద్రం కో ఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ శ్రామిక ప్రజల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులు వెంకటేష్, చంద్రయ్య, ఈశ్వరరావు, ప్రభు, అనాజీ, రమేష్, శ్రీను, యకమ్మ, దేవి, హేమ,సువర్ణ, హారిక, మాదవి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…