– ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు , స్టేషనరీ పంపిణీ
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
రుద్రారంలోని ప్రాథమిక – ఉన్నత పాఠశాలల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శుక్రవారం నోట్బుక్స్ , పెన్నులు , పెన్సిళ్ళు , పెన్పెన్సిళ్ళు , రబ్బర్లు , షార్పనర్లు , స్కేళ్ళను పంపిణీ చేసింది . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ . ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ల నేతృత్వంలో , ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ సౌజన్యంతో , 2013 నుంచి ఆయా పాఠశాలల్లో గీతం నోటుకు పంపిణీ చేస్తున్న విషయం విదితమే . క్లాస్మేట్ నోట్ బుక్స్ , స్టేషనరీ సామగ్రిని తమ చిట్టి చేతుల్లో పట్టుకుని ఆయా పాఠశాలల విద్యార్థులు ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు కొత్త వాటిని ఉత్సుకతతో పరికించడం కనిపించింది . గీతం వర్సిటీ యాజమాన్యం , విద్యార్థుల ఉదారతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బహుదా ప్రశంసించారు . వినియోగించిన కాగితం పునర్ వినియోగం ప్రాముఖ్యత , విలువైన సహజ వనరుల సంరక్షణ , వ్యర్థాల పునరుత్పత్తి వంటి అంశాలను ఐటీసీ ప్రతినిధులు వివరించారు . గీతం హాస్పిటాలిటీ ఎగ్జిక్యూటివ్ జె.మీనా , వెంచర్ డెవలప్మెంట్ సెల్ కోచ్ పార్థసారథి , ఐటీసీ ప్రతినిధులు , పలువురు విద్యార్థులు ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…