Telangana

నైపుణ్యాల వేదిక స్కిల్ కార్నివాల్

విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహణ

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

నగరానికి చెందిన విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన 18వ స్కిల్ కార్నివాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. అబా కప్, వేద గణిత, స్పెల్లింగ్ బీ వంటి విజ్ఞాన, నైపుణ్యాలకు చెందిన ఈ స్కిల్ కార్నివాల్లో వివిధ దశల్లో వేలాది మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కూకట్ పల్లి వేదికగా నిర్వహించిన కార్నివాల్లో ఐదు రాష్ట్రాలకు చెందిన 7 వేల పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు ఈ జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించారు. ఈ ఎంపిక ప్రక్రియలో పాఠశాల స్థాయిలో 5 లక్షల మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో జిల్లాకు దాదాపు 800 మంది విద్యా ర్థులు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి 800 మంది విద్యార్థులు ఉన్నారని విశ్వం ఎడ్యుటెక్ చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ హరి చరణ్ తెలిపారు.

విశ్వం ఎడ్యుటెక్ జాతీయ విజేతలు విదేశాల్లో ప్రయా ణించడానికి, అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది .వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి అనువైన ప్రపంచ వేదికను అందిస్తుందని ఆయన పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వం ఎడ్యుటెక్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రోగ్రామ్ ‘ఫైనాన్షి యల్ లిటరసీ అండ్ ఎంటర్ ప్రూనర్షిప్ ‘ను ప్రారంభించింది.

విశ్వం ప్రయత్నాలు, వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన విలు వలతో రూపొందించబడ్డాయని సంస్థ వ్యవస్థా పకులు పీపీఆర్ విశ్వం తెలిపారు. న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నైపుణ్య కార్యక్రమంతో విద్యార్థుల 21వ శతాబ్దపు నైపుణ్యాలను మార్చడానికి కంపెనీ గణనీయమైన కృషి చేస్తోందని చెప్పారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago