విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహణ
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
నగరానికి చెందిన విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన 18వ స్కిల్ కార్నివాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. అబా కప్, వేద గణిత, స్పెల్లింగ్ బీ వంటి విజ్ఞాన, నైపుణ్యాలకు చెందిన ఈ స్కిల్ కార్నివాల్లో వివిధ దశల్లో వేలాది మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కూకట్ పల్లి వేదికగా నిర్వహించిన కార్నివాల్లో ఐదు రాష్ట్రాలకు చెందిన 7 వేల పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు ఈ జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించారు. ఈ ఎంపిక ప్రక్రియలో పాఠశాల స్థాయిలో 5 లక్షల మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో జిల్లాకు దాదాపు 800 మంది విద్యా ర్థులు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి 800 మంది విద్యార్థులు ఉన్నారని విశ్వం ఎడ్యుటెక్ చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ హరి చరణ్ తెలిపారు.
విశ్వం ఎడ్యుటెక్ జాతీయ విజేతలు విదేశాల్లో ప్రయా ణించడానికి, అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది .వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి అనువైన ప్రపంచ వేదికను అందిస్తుందని ఆయన పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వం ఎడ్యుటెక్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రోగ్రామ్ ‘ఫైనాన్షి యల్ లిటరసీ అండ్ ఎంటర్ ప్రూనర్షిప్ ‘ను ప్రారంభించింది.
విశ్వం ప్రయత్నాలు, వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన విలు వలతో రూపొందించబడ్డాయని సంస్థ వ్యవస్థా పకులు పీపీఆర్ విశ్వం తెలిపారు. న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నైపుణ్య కార్యక్రమంతో విద్యార్థుల 21వ శతాబ్దపు నైపుణ్యాలను మార్చడానికి కంపెనీ గణనీయమైన కృషి చేస్తోందని చెప్పారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…