మనవార్తలు ,పటాన్చెరు:
టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.వి.శివశంకర్ రావు ఈ నెల మే 1న తెలంగాణ ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డ్ అందుకున్న సందర్భంగా బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన్ని అభినందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శివశంకర్ రావు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేయడం ఆయన సేవా తత్వానికి నిదర్శనం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మికులకు మరిన్ని సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, పోచారం కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…