ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఈనెల 16 నుండి 18 తేదీ వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్, కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా టీం అండర్ 14, అండర్ 17 కబడ్డీ బాలుర బాలికల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఆతిథ్యం అందిస్తున్నామని తెలిపారు. 33 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు, 60 మంది కోచులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ క్రీడోత్సవాలలో పాల్గొనబోతున్నారని తెలిపారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా వాలీబాల్ కబడ్డీ అంశాలలో ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు. 40 లక్షల రూపాయలు సొంత నిధులతో క్రీడోత్సవాల నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డిఎస్పి ప్రభాకర్, సిఐ వినాయక రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దిన్, ఎల్లయ్య, ప్రమోద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…
పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…
పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…
-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…