Telangana

శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీ నియామకం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీనీ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప మహిళా కార్యాలయం లో శేరిలింగంపల్లి బీసీ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసి నూతన కమిటీని నియమించారు. ముఖ్యాతిధిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ హాజరై కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ముఖ్య నాయకులు నర్సింలు ముదిరాజ్ లు పాల్గొని మహిళ కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు.

శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షురాలుగా ఆర్. అనిత, ఉపాధ్యక్షురాలు ఎం.. సునంద, మరియు కే. రాజమణి, సంయుక్త ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగమణి. కోశాధికారిగా ప్రతిమ లను నియమించగా వారు నియామక పత్రాలను స్వీకరించారు. మన సమస్యలతో పాటు కాలనీ సమస్యలను పరిష్కరించుకొనుటకు మీరందరూ సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించుటకు మేమందరం మీ వెంట ఉన్నామని, మీరందరూ మా వెంట ఉండి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉందామని సంఘం సభ్యులు తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో 17 శాతం మాత్రమే లబ్ది పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారనీ, మనకు 42 శాతం ఉండాలి కాబట్టి 42 శాతం ప్రత్యక్షంగా బీసీలు లబ్ధి పొందే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం స్థానిక ఎన్నికల్లోను సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పిటిసి కార్పొరేటర్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ లు కూడా 42 శాతం రిజర్వేషన్ చేసి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని కోరారు. మహిళలు పురుషులతో సమానం కాబట్టి అందరూ పోరాడండి పోరాడుతే ఈ ప్రజాస్వామ్యంలో మనకు న్యాయం జరుగుతుందనీ, సామాజిక న్యాయం మరియు రాజకీయ న్యాయం జరిగే వరకూ పోరాడుదామని పిలుపునిచ్చారు. తమ ఫై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వంతు కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసి, బీసీల ఐక్యత కు పాటుపడతామనీ అధ్యక్షురాలు అనిత మరియు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం లో బి గంగ, ఆర్. లతటీ. అంకమ్మ, జ్యోతి, ఎం పద్మ, పద్మాదేవి,జి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

7 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago